ఆసియా-ఓషియానియా గ్రూపు-1 డేవిస్ కప్ రెండో రౌండ్లో పోటీలు మార్చి ఆరో తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ పోటీల్లో భారత జట్టు చైనీస్ తైపీతో తలపడనుంది. ఈ పోరు కోసం భారత డేవిస్ కప్ జట్టు ఆదివారం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లింది. మొదటి రౌండ్లో భారత్కు బై లభించగా, చైనీస్ తైపీ జట్టు కజకిస్థాన్ను ఖంగుతినిపించింది.
చైనీస్ తైపీ, భారత జట్లు మొదటిసారి తలపడుతున్నాయి. ఈ రౌండ్లో గెలిచిన జట్టు వరల్డ్ గ్రూపు-1 ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తుంది. సోమ్దేవ్ దేవ్వర్మన్, రోహన్ బోపన్న, సింగిల్స్తో బరిలోకి దిగుతారు. భారత టెన్నిస్ సీనియర్ ఆటగాళ్ళు లియాండర్ పేస్, మహేశ్ భూపతిలు డబుల్స్ విభాగంలో ఆడుతారు. సోనమ్ సింగ్ రిజర్వ్ ఆటగాడిగా కొనసాగుతాడు.