ఆసియా బాక్సింగ్‌లో మేరీకోమ్ స్వర్ణం: ప్రియాంక ప్రశంస

బుధవారం, 1 అక్టోబరు 2014 (13:10 IST)
ఇంచియాన్‌లో జరుతున్న 17వ ఆసియా క్రీడల్లో మేటి బాక్సర్ మేరీకోమ్ స్వర్ణ పతకం సాధించింది. ఫ్లై వెయిట్ (48-51 కిలోలు) విభాగంలో కజికిస్తాన్ బాక్సర్ జైనా షెకర్ బెకోవాపై ఫైనల్లో మేరీ గెలుపొందింది. దాంతో, ఆసియా క్రీడల్లో భారత్ కు ఏడో స్వర్ణం లభించింది.
 
ఆసియా క్రీడల బాక్సింగ్‌లో పసిడి చేజిక్కించుకున్న స్టార్ బాక్సర్ మేరీ కోమ్‌పై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రశంసల జల్లు కురిపించింది. మేరీ కోమ్ ఓ పులి అని ప్రియాంక అభివర్ణించింది. ఇటీవలే మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన 'మేరీ కోమ్' సినిమాలో ప్రియాంకా చోప్రా లీడ్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి