అర్జున అవార్డును పొందడానికి కోర్టుకెక్కడం తనను బాధించిందని అయితే, న్యాయం కోసం ఆ విధంగా పోరాడక తప్పలేదని బాక్సర్ మనోజ్ కుమార్ అన్నాడు. తన పేరు జాబితాలో చేరినందుకు ఆనందిస్తున్నానని మనోజ్ కుమార్ తెలిపాడు.
అయితే, రివ్యూ సమావేశం ముగిసిన తర్వాత కమిటీ విడుదల చేసిన తుది జాబితాలో తన పేరు కనిపించకపోవడంతో కంగు తిన్నాడు. తన కంటే ఎంతో తక్కువ స్థానంలో ఉన్న జై భగవాన్ను ఎంపిక చేసి, తన పేరును పక్కకు తప్పించడం అన్యాయమని పేర్కొంటూ అతను ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
అయితే, మనోజ్ నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడలేదని తేలడంతో, ఇప్పుడు అతని పేరును చేరుస్తామని కోర్టుకు హామీ ఇచ్చాడు. కోర్టు ముందు పొరపాటును అంగీకరించడంతో సమస్యకు తెరపడింది.