సతీశ్ అమోఘ ప్రదర్శన సీఎం జయలలితను కూడా ఆకట్టుకుంది. వెంటనే అతనికి రూ.50 లక్షల నజరానా ప్రకటించారు. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించడం ద్వారా దేశంతో పాటు రాష్ట్రం కూడా గర్వించేలా చేశావని సతీశ్ను తమిళనాడు సీఎం జయ అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న తొలి ఈవెంట్లోనే సతీశ్ బంగారు పతకం గెలవడం చిరస్మరణీయమన్నారు.