17వ ఆసియా క్రీడల్లో భాగంగా సోమవారం జరిగిన స్క్వాష్ మహిళల సింగిల్స్ ఈవెంట్లో భారత్ స్టార్ ప్లేయర్ దీపికా పల్లికల్ ఓటమి చవిచూసింది. మలేషియాకు చెందిన నికోలస్ డేవిడ్ చేతిలో 4-11, 4-11, 5-11 తేడాతో దీపికా సెమీస్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సెమీస్లో ఓటమి పాలైనప్పటికీ... దీపిక కాంస్యాన్ని ఖరారు చేసుకుంది.