ఇండియన్ ఛాంపియన్స్ లీగ్ టోర్నీ పేరిట భారత్లో నిర్వహించిన ఫుట్బాల్ టోర్నీ ఫైనల్లో భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జట్టు విజయభేరీ మోగించింది. శనివారం జరిగిన మ్యాచ్లో సచిన్ జట్టుపై గంగూలీ విజయం సాధించింది. ఇండియన్ ఛాంపియన్స్ లీగ్ (ఐఎస్ఎల్) పేరిట తొలిసారి భారత్లో జరిగిన ఫుట్ బాల్ టోర్నీలో పాల్గొన్న జట్లలో సచిన్ కేరళ జట్టును కొనుగోలు చేయగా, గంగూలీ సొంత జట్టు కోల్కతాను కొనుగోలు చేసిన విషయం తెల్సిందే.