జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ)లో జాతి వ్యతిరేక కార్యక్రమం జరిగిన నేపథ్యంలో ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ యోగేశ్వర్ దేశభక్తితో స్పందించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశభక్తిపై యోగేశ్వర్ దత్ రాసిన పద్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురు అమర వీరుడైతే లాన్స్ నాయక్ హనుమంతప్ప ఏమవుతారో చెప్పాలని యోగేశ్వర్ ప్రశ్నించడంతో దేశభక్తుల హృదయాలు ఆర్ధ్రమయ్యాయి. మనసుకు హత్తుకునేలా, రాజకీయ నాయకులను మేలుకొలిపేలా ఈ పద్యాన్ని రాశారని అనేక మంది ప్రశంసిస్తున్నారు.