క్రికెటర్ అతుల్ శర్మ తనను, తన కుమార్తెను చంపుతానంటూ హెచ్చరికలు చేస్తున్నాడంటూ భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఆరోపిస్తూ.. ముంబై నగర పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశాడు. అయితే, వీరిద్దరి మధ్య విభేదాలు పొడచూపడానికి కారణాలు లేకపోలేదు.
గత కొంతకాలం నుంచి విడిగా ఉంటున్న పేస్, రియాలు కుమార్తె విషయంలో ముంబై స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. కూతురు రక్షణ బాధ్యత తనకే అప్పగించాలని పేస్ కోరాడు. కుమార్తెను తనకే అప్పగించాలని అటు రియా కూడా కోరుతోంది.