షూటింగులో ఖాతా తెరిచిన భారత్... ప్యారిస్ ఒలింపిక్స్‌ 2024లో నేటి షెడ్యూల్

వరుణ్

సోమవారం, 29 జులై 2024 (09:50 IST)
ప్యారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడా పోటీల్లో భారత్ శుభారంభం చేసింది. షూటింగ్ విభాగంలో భారత్‌కు కాంస్య పతకం సాధించింది. ఇక సోమవారం షూటింగులో మరో రెండు మెడల్స్ భారత్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. అవేంటి? ఇంకా ఏఏ ఈవెంట్లు ఈరోజు జరగనున్నాయి వివరాలు తెలుసుకుందాం.
 
ఒలింపిక్స్ జులై 29 షెడ్యూల్లో భాగంగా, బ్యాడ్మింటన్ విభాగంలో మెన్స్ డబుల్స్(సాత్విక్-చిరాగ్ మార్క్-మెర్విన్) - మధ్యాహ్నం 12, ఉమెన్స్ డబుల్స్ (అశ్విని - తనీషా × నమి-చిహారు) మధ్యాహ్నం 12.50 మ్యాచ్ జరుగుతుంది. అలాగే, మెన్స్ సింగిల్స్ (లక్ష్యసేన్ - జులియన్) - సాయంత్రం 5.30 మ్యాచ్ జరుగుతుంది. 
 
ఇక షూటింగ్ విభాగంలో 10 మీ.ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫికేషన్ (మను-సరబ్ జోత్, రిథమ్-అర్జున్ చీమా) మధ్యాహ్నం 12.45, మెన్స్ ట్రాప్ క్వాలిఫికేషన్ (పృథ్వీరాజ్) - మధ్యాహ్నం ఒంటిగంటకు మ్యాచ్ జరుగుతుంది. హాకీ విభాగంలో భారత్ × అర్జెంటీనా జట్లు సాయంత్ర 4.15 గంటలకు తలపడతాయి. టేబుల్ టెన్నిస్ విభాగంలో ఉమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్ (శ్రీజ × జియాన్)- రాత్రి 11.30 తలపడుతారు. 
 
ఈ క్రీడా పోటీల్లో పతకాలు ఎందులో వచ్చే అవకాశముందనే విషయాన్ని పరిశీలిస్తే, 10 మీ.ఎయిర్ రైఫిల్ ఉమెన్స్ ఫైనల్ (రమిత) - మధ్యాహ్నం 1, మెన్స్ ఫైనల్ (అర్జున్ బబుతా) - మధ్యాహ్నం 3.30, మెన్స్ టీమ్ క్వార్టర్స్ (తరుణ్దీప్, బొమ్మధేవర ధీరజ్(విజయవాడ), ప్రవీణ్) - సాయంత్రం 6.30, మెడల్ రౌండ్లు- రాత్రి 8.18, మెన్స్ సింక్రనైజ్డ్ 10మీ ప్లాట్ఫామ్ ఫైనల్ - మధ్యాహ్నం 2.30, స్కేట్ బోర్డింగ్ : మెన్స్ స్ట్రీట్ ఫైనల్ - రాత్రి 8.30, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ - మెన్స్ టీమ్ ఫైనల్ - రాత్రి 9, స్విమ్మింగ్ : ఉమెన్స్ 400మీ. వ్యక్తిగత మెడ్లీ ఫైనల్ - రాత్రి 12, మెన్స్ 200మీ. ఫ్రీస్టైల్ ఫైనల్ - రాత్రి 12.10 మ్యాచ్‌లు జరుగుతాయి. 
 
అయితే, ఒలింపిక్స్ మెడల్స్ టేబుల్లో టాప్ పొజిషన్ కోసం అమెరికా, చైనా ఎక్కువగా పోటీపడుతుంటాయి. కానీ ఈ సారి ఆస్ట్రేలియా జోరు చూపిస్తోంది. ప్రస్తుతానికి ఆసీస్ 4 గోల్డ్ మెడల్స్, 2 రజతాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒకే ఒక్క కాంస్యంతో భారత్ 22వ స్థానంలో కొనసాగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు