ఈ మ్యాచ్లో 21-11, 21-18 స్కోరు తేడాతో టాగోను ఓడించిన కశ్యప్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 28వ ర్యాంకులో ఉన్న కశ్యప్ కేవలం 34 నిమిషాల్లోనే వరుస సెట్లలో టాగోను ఓడించడం గమనార్హం. మరోవైపు మహిళల సింగిల్స్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ రెండో రౌండ్కు దూసుకెళ్లింది.