ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించిన పివి సింధుకు శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. స్కాట్లాండ్ నుండి పివి సిందు, గోపీచంద్ హైదరాబాద్కు చేరుకున్నారు. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో సింధుకు అభినందన కార్యక్రమం నిర్వహించారు.
క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ షిజియాన్ వాంగ్పై సింధు గెలుపొందింది. గత ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించిన పివి సింధు, వరల్డ్ ఛాంపియన్షిప్లో రెండు మెడల్స్ సాధించిన క్రీడాకారిణిగా సింధు రికార్డు నెలకొల్పింది.