లండన్లో ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న ఒలింపిక్ పోటీల్లో భారత్ నుంచి సుమారు వంద మందికిపైగా అథ్లెట్లు పోటీపడుతున్నారు. అయితే 2012 విశ్వక్రీడల్లో శాకాహారం దొరకక భారత్ అథ్లెట్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అదే పరిస్థితి పునరావృతం కాకుండా రియో ఒలింపిక్స్లో చర్యలు తీసుకోవాల్సిందిగా భారత్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అక్కడి ఆహారం తమ అథ్లెట్ల ప్రదర్శనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకూడదని ముందే నిర్వాహకులకు లేఖ రాశామని రియో ఒలింపిక్స్ భారత చీఫ్ డి మిషన్ రాఖేష్ గుప్తా తెలిపారు.