నేనూ కబడ్డీ ఆడాను : సచిన్ టెండూల్కర్

ఆదివారం, 27 జులై 2014 (12:49 IST)
పాఠశాల స్థాయిలో తాను క్రికెట్, టెన్నిస్, కబడ్డీ కూడా ఆడినట్టు భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన మనస్సులోని మాటను వెల్లడించారు. ముంబైలో జరిగిన ప్రో కబడీ లీగ్ ప్రారంభోత్సవానికి సచిన్ కుటుంబసమేతంగా హాజరయ్యాడు. ప్రో కబడీ లీగ్‌కు మద్దతు తెలపడానికే తాను ఇక్కడకు వచ్చానని సచిన్ అన్నాడు. 
 
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలో తాను క్రికెట్, టెన్నిస్‌తో పాటు కబడ్డీ కూడా ఆడినట్టు చెప్పాడు. మళ్లీ ఇన్నాళ్లకు కబడ్డీ పోటీలు చూడటం చాలా ఆనందంగా ఉందన్నాడు. కబడ్డీ ఆటకు వేగం, చురుకుదనం, అప్రమత్తత చాలా ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సచిన్‌తో పాటు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా పాల్గొన్నారు. బాలీవుడ్ తారల సందడితో తొలిరోజు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ప్రో కబడ్డీ లీగ్‌లో విశాఖపట్టణానికి చెందిన తెలుగు టైటాన్స్ జట్టు కూడా పాల్గొంటుంది. 

వెబ్దునియా పై చదవండి