భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, పీవీ సింధు స్విస్ ఓపెన్ ప్రి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సైనా 21-7, 21-15తో కరీన్ షానాస్ (జర్మనీ)పై విజయం సాధించగా, ఆరో సీడ్గా బరిలోకి దిగిన సింధు 21-19, 21-10తో చోల్ మజీ (ఐర్లాండ్)ను మట్టికరిపింది.
గురువారం జరిగే ప్రిక్వార్టర్స్లో క్రిస్టినా గావ్న్హోల్ట్ (చెక్ రిపబ్లిక్)తో సైనా, పాయ్ యు పో (చైనీస్ తైపీ)తో సింధు తలపడేందుకు సై అంటున్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్కే చెందిన సాయిప్రణీత్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగిన రెండో రౌండ్లో సాయిప్రణీత్ 21-7, 21-10తో అర్త్యోమ్ సవత్యుజిన్ (ఉజ్బెకిస్తాన్)పై, ప్రణయ్ 21-16, 21-13తో లార్స్ షాన్జ్లెర్ (జర్మనీ)పై గెలుపొందారు.