సైనాకు కేంద్రం రూ. 9 లక్షలు ఆర్థిక సాయం... ఫిజియోథెరపిస్ట్‌ నియామకం...

బుధవారం, 24 జూన్ 2015 (14:48 IST)
2016 రియో ఒలింపిక్స్ సన్నాహకాల్లో భాగంగా పూర్తి స్థాయి ఫిజియోథెరపిస్ట్‌ను నియమించుకునే నిమిత్తం భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసింది. ఈ మొత్తాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆమెకు మంజూరు చేసింది. ఈ మొత్తం ఫిజియోథెరపిస్ట్‌కు నెలకు రూ.60 వేల చొప్పున  జూన్ నెల నుంచి 15 నెలల కాలానికి సరిపడే విధంగా ఈ నగదు మొత్తాన్ని కేటాయించారు. 
 
కేంద్ర ప్రభుత్వం నగదు సహాయం చేసినప్పటికినీ ఫిజియోథెరపిస్ట్‌గా ఎవరిని నియమించుకోవాలన్నది సైనా నిర్ణయానికే వదిలిపెట్టినట్టు క్రీడల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం సైనా బెంగళూరులోని ప్రకాశ్ పదుకొన్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. తనకు ఆర్థిక సహాయం చేసినందుకు సైనా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంది. 

వెబ్దునియా పై చదవండి