భారత బ్యాడ్మింటన్ క్రీడలో అత్యంత విజయవంతమైన గురుశిష్యుల బంధం తెగిపోతోంది. తన గురువు పుల్లెల గోపీచంద్తో బంధాన్ని హైదరాబాద్ షట్లర్ సైనా నెహ్వాల్ తెగతెంపులు చేసుకుంది. గోపీచంద్ శిష్యరికంలో ఆమె దేశానికి పలు పతకాలు సాధించి పెట్టారు. గోపీచంద్ను వదిలేసి ఆమె విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల నుంచి ఆమె క్వార్టర్ ఫైనల్స్ దశలోనే వెనుదిరిగారు. ఉబెర్ కప్ సమయంలో విమల్ కుమార్ ఇచ్చిన సలహాలు ఉపయోగపడ్డాయని, అయితే ఆసియా క్రీడలు ముగిసిన తర్వాత మళ్లీ హైదరాబాద్ వస్తానని సైనా చెప్పినట్లు తెలుస్తోంది.
గోపీచంద్తో సైనా విడిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2011లో భాస్కర బాబు వద్ద శిక్షణ తీసుకోవాలని సైనా భావించారు. అయితే, మూడు నెలల తర్వాత తిరిగి గోపీచంద్ వద్దకు వచ్చేశారు. ప్రస్తుతం తాను కేవలం 15 రోజుల శిక్షణ కోసమే తాను బెంగళూర్ వెళ్తున్నానని, అది దీర్ఘకాలికం అయ్యే అవకాశం కూడా లేకపోలేదని సైనా అంటున్నారు.