చైనా ఓపెన్ సూపర్ సిరీస్ విజేతగా సైనా నెహ్వాల్!

ఆదివారం, 16 నవంబరు 2014 (14:29 IST)
చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్‌ విజేతగా హైదరాబాద్ అమ్మాయి సైనా నెహ్వాల్ విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో 35వ ర్యాంకర్ అకెన్ యమగుచి (జపాన్)ను మట్టి కరిపించి సైనా నెహ్వాల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 
 
అంతకుముందు, శనివారం జరిగిన సెమీ ఫైనల్ లో చైనా క్రీడాకారిణిని ఓడించి ఫైనల్లో ప్రవేశించిన సైనా, తన జైత్రయాత్రను కొనసాగించి టైటిల్ కైవసం చేసుకుంది. గతంలో ఐదుసార్లు ఈ టోర్నీలో పాల్గొన్న సైనా కనీసం ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది. ఆరోసారి టోర్నీలో తన సత్తా చాటిన ఈ హైదరాబాదీ తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సాధించడంతో పాటు విజేతగానూ నిలిచింది. 

వెబ్దునియా పై చదవండి