అంతకుముందు, శనివారం జరిగిన సెమీ ఫైనల్ లో చైనా క్రీడాకారిణిని ఓడించి ఫైనల్లో ప్రవేశించిన సైనా, తన జైత్రయాత్రను కొనసాగించి టైటిల్ కైవసం చేసుకుంది. గతంలో ఐదుసార్లు ఈ టోర్నీలో పాల్గొన్న సైనా కనీసం ఫైనల్కు కూడా చేరుకోలేకపోయింది. ఆరోసారి టోర్నీలో తన సత్తా చాటిన ఈ హైదరాబాదీ తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సాధించడంతో పాటు విజేతగానూ నిలిచింది.