స్త్రీల పక్షాన పోరాటం చేస్తా : సానియా మీర్జా

మంగళవారం, 25 నవంబరు 2014 (18:35 IST)
హింస నిర్మూలనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా స్త్రీల పక్షాన పోరాడతానని భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ ఏస్ సానియా మీర్జా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి సుహృద్భావ ప్రచారకర్తగా నియమితురాలైన నేపథ్యంలో ఆమె హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. 
 
ఐక్యరాజ్యసమితి తనకు అప్పగించిన బాధ్యతను శక్తిమేర నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. సమాజంలో ఇంకా మహిళలపై వివక్ష కొనసాగుతోందని, ఇది ఎంతో ఆవేదనకు గురి చేస్తోందన్నారు. 
 
కాగా, ఐక్యరాజ్యసమితి తరపున దక్షిణాసియా సుహృద్భావ ప్రచారకర్తగా సానియా మీర్జా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో, దక్షిణాసియాలో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఆమె ఐరాసతో కలసి పనిచేయనుంది.

వెబ్దునియా పై చదవండి