కామన్వెల్త్ గేమ్స్ : సెమీస్‌లోకి ప్రవేశించిన భారత జట్టు!

శుక్రవారం, 1 ఆగస్టు 2014 (13:52 IST)
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-2 తేడాతో జయభేరి మోగించింది. 
 
4వ నిమిషంలో రఘునాథ్, 8వ నిమిషంలో రూపిందర్ పాల్, 22వ నిమిషంలో రమణ్ దీప్ సింగ్, 26వ నిమిషంలో ఎస్.వి.సునీల్, 58వ నిమిషంలో మన్ ప్రీత్ సింగ్‌లు గోల్స్ సాధించారు. ఈ విజయంతో పూల్-ఏలో భారత్ ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. సెమీస్‌లో న్యూజిల్యాండ్‌తో భారత్ తలపడుతుంది.

వెబ్దునియా పై చదవండి