శ్రీకాంత్‌పై గోపిచంద్ ప్రశంసల జల్లు: గొప్ప పోరాట యోధుడు!

మంగళవారం, 31 మార్చి 2015 (10:56 IST)
ఇండియా ఓపెన్ సిరీస్‌లో టైటిల్ విజేతగా నిలిచిన కిదాంబి శ్రీకాంత్‌పై జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్ ప్రశంసల వర్షం కురిపించాడు.

అద్భుతమైన షాట్లతో రాణిస్తున్న శ్రీకాంత్‌ను గోపిచంద్ గొప్ప పోరాట యోధుడిగా అభివర్ణించాడు. అయితే దేశానికి మరిన్ని కీర్తిప్రతిష్టలను తీసుకువచ్చేందుకు శ్రీకాంత్ తన ఆటతీరును ఇంకా మెరుగుపరుచుకోవలసిన అవసరం ఉందని చెప్పాడు. 
 
అయితే శ్రీకాంత్ ముఖ్యంగా అతని మానసిక సామర్థ్యం మరింత మెరుగుపడాల్సి ఉందని గోపీచంద్ స్పష్టం చేశాడు. ఆదివారం రాత్రి జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్‌లో శ్రీకాంత్ 18-21, 21-13, 21-12 గేముల తేడాతో ప్రపంచ ఆరో ర్యాంకు ఆటగాడు విక్టర్ అక్సెల్‌సెన్‌ను ఓడించి తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి