గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. సగం అయ్యాక చక్కెర, యాలకులపొడి, కుంకుమ పువ్వు వేసి కలపాలి. సన్నని మంట మీద ఉంచి పైనాపిల్ ముక్కలు వేసి ఐదు నిమిషాల తర్వాత దించేయాలి. ఈలోపు కడాయిలో జీడిపప్పు, బాదం, పిస్తాలను నెయ్యి వేసి వేయించుకోవాలి. వీటిని పైనాపిల్ బాసుందీలో కలిపి ఫ్రిజ్లో పెట్టుకోవాలి. చల్లగా తాగితే వేసవిలో హాయిగా ఉంటాయి.