తయారీ విధానం :
మొదట దళసరి మూకుడులో కొంచెం నెయ్యి వేసి రవ్వను దోరగా వేయించుకోవాలి. దీంట్లో కొబ్బరి తురుము, పంచదార వేసి నీరు కొద్దిగా పోసి కలియ బెట్టాలి. చెక్కర కరిగి గట్టిపడుతున్నప్పుడు యాలకుల పొడి చల్లి దించుకోవాలి. ఈ మిశ్రమంలో నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి ఆరిపోక ముందే గుండ్రంగా లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూలుగా చేసేటప్పుడు ఆరిపోయినట్లనిపిస్తే... కొంచెం పాలు చల్లుకుంటూ ఉండలు చుట్టుకుంటే బాగా వస్తాయి.