అలా జరగకుంటే బ్లేడుతో అక్కడ కోసుకుంటా - బండ్ల గణేష్‌

గురువారం, 22 నవంబరు 2018 (21:22 IST)
కాంగ్రెస్ పార్టీలో బండ్ల గణేష్ చేరిన తరువాత ఆ పార్టీ మీద ఎక్కడ లేని హోప్స్ పెట్టుకున్నారాయన. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపును తలుచుకుంటేనే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారని చెబుతున్నారు బండ్ల. 
 
అయితే బండ్ల గణేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణాలోనే కాదు ఎపి రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుంటే డిసెంబర్ 11వ తేదీన హైదరాబాదులో గొంతు కోసుకుంటానన్నారు బండ్ల గణేష్‌. మిగిలిన నేతలు చెప్పే మాటలకు తాను చెప్పే మాటలకు ఎంతో వ్యత్యాసం ఉంటుందంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే మాత్రం తాను ఆత్మహత్య చేసుకోవడం ఖచ్చితమంటున్నారు. ఆ అవసరం రాదని, కాంగ్రెస్ గెలవడం ఖాయమంటున్నారు. 
 
బండ్ల గణేష్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. మరి చూడాలి... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే నిజంగానే బండ్ల గణేష్‌ ఆత్మహత్య చేసుకుంటారా లేకుంటే మిగిలిన నాయకులలా మాటలు చెప్పి ఊరుకుంటారా. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు