రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్లతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కార్మికుల నిరసన రెండో రోజుకు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా కార్మికులు డిపోల బయట ధర్నాలు, ప్రదర్శనలు చేస్తున్నారు. సమ్మెలో చురుకుగా పాల్గొంటున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్, తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అతనికి తీవ్రంగా కాలిన గాయాలవ్వడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.