హైదరాబాదులో ఈ వరద నీళ్ల దరిద్రానికి కారణం గత ప్రభుత్వాలే అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వరద నీళ్లు వెళ్లాల్సిన నాలాల మీద 28 వేల కట్టడాలు ఉన్నాయనీ, వాటన్నిటినీ కూలగొడితేనే హైదరాబాదుకు ఇలాంటి పరిస్థితి ఉండదన్నారు. వీటిని కూల్చేటప్పుడు పత్రికలన్నీ పాజిటివ్గా రాయాలని కోరారు. వరదలపై సమీక్ష గురించి ఆయన మాట్లాడుతూ... " 448 శాతం ఎక్కువ వర్షపాతం పడింది. ఐతే ఈ వానల్లో మనిషే కాదు ఒక్క జంతువు కూడా చచ్చిపోలేదు. ఏదో హైదరాబాద్ నగరం మునిగిపోయిందని రాయొద్దు. హైదరాబాద్ బ్రాండను దెబ్బ తీయవద్దు.