ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 టీవీ ప్రసారాలను తమకు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అడగడం లేదని, అందుకే వాటి ప్రసారాలను నిలిపివేసినట్టు తెలంగాణ ఎంఎస్ఓ సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారాలను తెలంగాణ సర్కారు నిలిపివేసిన విషయం తెల్సిందే. ఈ విషయంలో జర్నలిస్టులు అనేక రకాలైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి ఒక వింతైన ప్రకటన చేశారు.
‘ప్రజలు ఆ రెండు ఛానెళ్ళని ప్రసారాలను ప్రసారం చేయాలని కోరడం లేదు. అందుకే ప్రసారం చేయడం లేదు. ఆ రెండు ఛానెళ్ళ ప్రసారాలను నిలిపివేయడంలో ప్రభుత్వ పాత్ర, ఎంఎస్ఓల పాత్ర ఏమీ లేదు. న్యాయస్థానాలు కూడా మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. వ్యాపార ఒప్పందాలు కొనసాగించే ఆలోచన ఆ రెండు సంస్థల యాజమాన్యాలకు లేదని పేర్కొన్నారు.