గద్వాల పట్టణంలో బుధవారం పురాతనంగా ఉన్న బిందె ఒకటి బయటపడింది. దీంతో ఆ బిందెలో బంగారు, వెండి, వజ్రాలున్నాయని ప్రచారం జరిగింది. దాంతో ఆ బిందెను నిన్న తహశీల్దారు కార్యాలయంలో భద్రపరిచారు. పురావస్తు శాఖ అధికారుల సమక్షంలో ఇవాళ దానిని తెరిచి చూసినవారు షాక్ కు గురయ్యారు. ఎందుకంటే ఆ బిందెలో బురద, నీళ్లు తప్ప ఏమీ లభ్యం కాలేదు. దాంతో అంతా ఉసూరుమన్నారు.
క్షణాల్లోనే ఈ విషయం పట్టణమంతా వ్యాపించడంతో ఐదారవేల మంది ప్రజలు ఆ బిందెలో ఏముందో తెలుసుకునేందుకు వచ్చారు. దాంతో ఆ బిందెకు భద్రత కూడా కల్పించాల్సి వచ్చింది. తీరా దాన్ని తెరిచి చూస్తే మట్టి, నీళ్లు తప్ప ఏమీ లభ్యం కాలేదు.