తెలంగాణ రాష్ట్ర ఏర్పాటై ఆర్నెల్లు అయినప్పటికీ.. తెలంగాణా నడిచే ఎక్స్ప్రెస్ రైళ్ళకు ఇంకా ఆంధ్రా ప్రాంత పేర్లను కొనసాగించడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా.. రాజధాని హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ఎక్స్ప్రెస్ రైలు పేరును మార్చకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ మధ్య నడుస్తున్న రైలును తెలంగాణ ఎక్స్ప్రెస్గా పిలుస్తున్న నేపథ్యంలో దాని పేరును కొమురం భీం ఎక్స్ప్రెస్గా మార్చాలని, ఏపీ ఎక్స్ప్రెస్కు తెలంగాణ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి తన లేఖలో కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ఏర్పాటై ఆరు నెలలు గడుస్తున్నా హైదరాబాద్ - న్యూఢిల్లీ రైలుకు ఏపీ పేరునే కొనసాగించడం సరికాదని ఆయన పేర్కొన్నారు.