ఈ సమావేశాలు ముగిసిన తర్వాత విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు ఈసారి కేంద్రమంత్రి పదవి దక్కనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో 22 మంది క్యాబినెట్, 22 మంది సహాయమంత్రులు ఉన్న విషయం తెల్సిందే.