హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం: బొంతు రామ్మోహన్‌

గురువారం, 11 ఫిబ్రవరి 2016 (10:45 IST)
తెలంగాణ భవన్‌లో రాష్ట్రమంత్రులు, తెరాస కార్పొరేటర్లు గురువారం ఉదయం సమావేశమయ్యారు. మేయర్‌ ఎన్నికపై కార్పొరేటర్లకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్‌ మీడియాతో మాట్లాడుతూ... మేయర్‌గా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సీఎం మార్గదర్శకత్వంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం సీఎం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. నగరంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తామని తెరాస మేయర్ అభ్యర్థిగా ఎన్నికైన బొంతు రామ్మోహన్ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి