హైదరాబాద్: కారులో ఉన్నట్టుండి మంటలు

శుక్రవారం, 1 జులై 2022 (19:57 IST)
హైదరాబాదులో ఘోరం జరిగింది. మాదాపూర్‌లోని హైటెక్ సిటీ సమీపంలో ఉన్నట్టుండి ఓ కారులో మంటలు చెలరేగాయి. కారు నడుస్తుండగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్నవారు అప్రమత్తమవడంతో ప్రాణనష్టం తప్పింది.
 
కారులో ఉన్నవారు వాటిని గుర్తించి వెంటనే దిగిపోయారు. మంటలకు కారు ధ్వసమయింది. ఈ నేపథ్యంలో హైటెక్ సిటీ దారిలో వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును రోడ్డుపైనుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు