చంద్రబాబు అలా దొరికిపోతే.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం చిక్కలేదని డిగ్గీ రాజా ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాదులో డిగ్గీ రాజా మాట్లాడుతూ, ఓటుకు నోటు కుంభకోణాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ టీడీపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఫైర్ అయ్యారు. హైదరాబాదును యూటీ చేయాలంటూ ఏపీ మంత్రులు డిమాండ్ చేస్తుంటే... టీటీడీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ ప్రజల అబ్బ సొత్తు, తాతల సొత్తు అన్నారు.