కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి సొంత తమ్ముడినే హత్య చేశాడో కిరాతకుడు. కాట్మండ శ్రీనివాస్(23)ను అతని అన్న శ్యాం ఇంట్లోనే కత్తితో దాడి చేసి హతమార్చాడు. శ్యాం మద్యం మత్తులో తమ్ముడితో ఘర్షణ పడి హత్య చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.