తోడబుట్టిన తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న

శనివారం, 25 ఏప్రియల్ 2015 (10:21 IST)
వేలు పట్టుకుని నడిపించిన అన్న నరరూప రాక్షసుడిలా మారాడు. పెరిగి పెద్దయిన తరువాత మద్యానికి బానిసయ్యాడు. తమ్ముడితో వచ్చిన కలహాలతో కక్ష పెంచుకున్నాడు. తనతోటి పెరిగిన తమ్ముడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. హత్య చేసి అడ్డుతొలగించుకున్నాడు. కరీం నగర్ జిల్లాలో జరిగిన వివరాలిలా ఉన్నాయి. 
 
కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం సైదాబాద్‌ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి సొంత తమ్ముడినే హత్య చేశాడో కిరాతకుడు. కాట్మండ శ్రీనివాస్‌(23)ను అతని అన్న శ్యాం ఇంట్లోనే కత్తితో దాడి చేసి హతమార్చాడు. శ్యాం మద్యం మత్తులో తమ్ముడితో ఘర్షణ పడి హత్య చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి