నారాయణ్ఖేడ్ ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ మంత్రి హరీష్రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. నారాయణఖేడ్లో అభ్యర్థిని పోటీకి నిలిపి టీఆర్ఎస్ పార్టీ వారసత్వ రాజకీయాలకు తుంగలో తొక్కిందన్నారు. 2015లో తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ చనిపోతే ఆయన భార్య సుగుణకు టీడీపీ టికెట్ ఇచ్చిందని, కానీ కాంగ్రెస్ ఏకగ్రీవంగా సహకరించకుండా తమ అభ్యర్థిని పోటీకి నిలిపింది నిజం కాదా? అని హరీష్ రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎన్నికలంటే భయమని, అందుకే వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. టెక్కలి ఎమ్మెల్యే చనిపోతే టీడీపీ తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టలేదా అని అడిగారు. ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.