తెలంగాణ టీడీపీ ఫైర్బ్రాండ్ రేవంత్ రెడ్డి భారతంలో అర్జునుడు వంటివాడని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు. వాడివేడిగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎర్రబెల్లి మరోమారు టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వైఖరిపై విమర్శలు గుప్పించారు. టీ సభలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా మహాభారతంలోని పాండవుల్లా సభలో యుద్ధం చేస్తున్నామని... టీఆర్ఎస్ సభ్యులు కౌరవ సమూహంతో సమానమన్నారు.