తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఓ తాగుబోతు సీఎం అని, అందుకే తెలంగాణ ప్రజలు కరెంట్ కష్టాలు పడాల్సి వచ్చిందని టీ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. పచ్చి తాగుబోతైన ముఖ్యమంత్రి నిర్ణయాలతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని మండిపడ్డారు.
కేసీఆర్ తన చేష్టలతో ప్రజలను తీవ్ర కష్టాలకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఉరికించి కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణలో కరెంటు కష్టాలకు చంద్రబాబే కారణమని నిరూపిస్తే... హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ముక్కును నేలకు రాస్తానని ఛాలెంజ్ విసిరారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.