గ్రేటర్ హైదరాబాద్ బరిధిలో 6.3 లక్షల ఓట్లను తొలగించారు. మరో 19 లక్షల ఓట్లను తొలగించేందుకు నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులకు స్పందన రాకుంటే వాటిని కూడా తొలగించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. కాగా, ప్రస్తుతానికి తొలగించిన ఓట్లన్నీ సీమాంధ్రులకు చెందిన ఓట్లుగా భావిస్తున్నారు. ఈ సందేహాన్ని విపక్ష పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు.
ఓటర్ల తొలగింపు అంశంపై మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో మూడు జిల్లాల పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్లో త్వరలో మరో 19 లక్షల మంది ఓటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. గతంలో 10.30 లక్షల మందికి నోటీసులు జారీశామని, నోటీసులకు స్పందించని 6.30 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించామని వివరణ ఇచ్చారు.