హైదరాబాద్లో మరో యువతి ప్రేమికుడి చేతిలో మోసపోయింది. ఆ బాధను భరించలేక ఆ యువతి అర్థాంతరంగా తనవు చాలించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. హైదరాబాద్, చాంద్రాయణగుట్ట మల్లేపల్లి ఫాతిమానగర్కు చెందిన హసన్కు ఉన్నీసా (19) అనే కుమార్తె ఉంది.
ఈ విషయం ప్రియుడికి చెప్పి, పెళ్లి చేసుకుందామని పదేపదే కోరుతున్నా.. అతను తాత్సారం చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకూ అతడితో ఫోన్లో సంభాషించింది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో.. గురువారం ఉదయం చీరెతో ఉరేసుకుని మరణించింది. హాసన్ ఫిర్యాదు మేరకు ఫలక్నుమా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.