గోదావరి పుష్కరాలు మరో రెండువారాల్లో జరుగనున్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్ర భూభాగంలో ఉన్న గోదావరి నదిలో ఎడారిని తలపిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ పుణ్యస్థలం బాసర వద్ద చుక్కనీరు లేదు. దీంతో టీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పైగా ఈ పుష్కరాల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బాసర వద్ద తలస్నానం చేయనున్నారు.