హైదరాబాద్ రాజ్‌మాతా హోటల్‌లో 7 కేజీల బంగారం స్వాధీనం!

శుక్రవారం, 28 నవంబరు 2014 (12:13 IST)
హైదరాబాద్‌లో బంగారు అక్రమ నిల్వలు కూడా పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే విదేశాల నుంచి బంగారు అక్రమంగా దిగుమతి చేస్తూ విమానాశ్రయ అధికారులకు చిక్కిపోతున్న ఎయిర్‌పోర్టుగా శంషాబాద్ రికార్డుకెక్కింది. ఇపుడు హైదరాబాద్‌, అబిడ్స్‌లో ఉన్న రాజ్‌మాతా హోటల్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన బంగారాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ హోటల్‌లో శుక్రవారం సోదాలు నిర్వహించిన పోలీసులు అక్కడ మకాం వేసిన ఇద్దరు ముంబై వాసుల వద్ద ఏడు కిలోలకు పైగా బంగారాన్ని కనుగొన్నారు. భారీ ఎత్తున బంగారంతో లాడ్జీలో దిగిన ముంబై వాసులపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు వారి వద్ద నుంచి బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు. అయితే అంత పెద్ద మొత్తంలో బంగారంతో వారు హైదరాబాద్‌లో ఏం చేస్తున్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి