గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలను వచ్చే డిసెంబర్ 16వ తేదీలోపు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి పద్మనాభ రెడ్డి వేసిన పిటిషన్ ఆధారంగా విచారణ జరిపిన కోర్టు సోమవారం ఉదయం ఈమేరకు తీర్పును వెలువరించింది.