హైదరాబాద్కి చెందిన సాయివర్మ అనే నాలుగేళ్ళ బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. హైదరాబాద్లోని చింతల్ ప్రాంతానికి చెందిన కోమలాదేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిని పరామర్శించడానికి సాయివర్మను తీసుకుని ఆమె కుమారుడు నిషాంత్ ఈనెల 11వ తేదీన ఖమ్మం వెళ్లాడు.