త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అనుమతించవద్దంటూ టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ వేర్వేరుగా హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు వీటిని తోసిపుచ్చింది.
ఇలాంటి సమయంలో ఈ పిటీషన్పై తాము జోక్యం చేసుకోలేమని పిటిషనర్లకు కోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, కాలె యాదయ్య, రెడ్యా నాయక్, విఠల్రెడ్డి, కనకయ్య తమ ఓటు హక్కును వినియోగించు కోవచ్చని స్పష్టం చేసింది.