క్రెడిట్ కార్డ్ పాయింట్ల్ రీడీమ్ చేస్కోండనగానే 12 సార్లు ఓటీపి చెప్పాడు, అంతే.. రూ. 1.75 లక్షలు గాయబ్

శనివారం, 6 మార్చి 2021 (11:46 IST)
కేటుగాళ్లు ఎలా బుట్టలో వేయాలో బాగా ట్రైనింగ్ పొంది వుంటారు. ఈ కేటుగాళ్లు హైదరాబాద్ కార్ఖానా ప్రాంతంలో వున్న ఓ ఖాతాదారుడిని నమ్మించి 12 సార్లు ఓటీపి చెప్పించుకుని అతడి ఖాతా నుంచి రూ. 1.75 లక్షలు కొట్టేశారు.
 
వివరాల్లోకి వెళితే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పాయింట్లు ఎక్స్ పైరీ అయిపోతున్నాయంటూ కార్ఖానా ప్రాంతంలో వున్న ఓ వ్యక్తికి కేటుగాళ్లు ఫోన్ చేసారు. అది నిజమే అని నమ్మి  ఆ వ్యక్తి వారు చెప్పినట్లు చేయడం మొదలుపెట్టారు. మీ పాయింట్లు రీడీమ్ అవుతున్నాయి, ఒకసారి ఓటీపి చెప్పండి అంటూ మొత్తం 12 సార్లు చెప్పించుకున్నారు.
 
ఆ ఓటీపి ద్వారా అతడి ఖాతా నుంచి ఏకంగా రూ. 1. 75 లక్షలు కొట్టేశారు. డబ్బు ఖాతా నుంచి మాయం కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు