సైనికుడి భార్యతో రాసలీలలు.. పరాయి పురుషుడితో భార్యను చూసి..?

గురువారం, 19 మే 2022 (17:30 IST)
సైనికుడి భార్యతో ఓ వ్యక్తి రాసలీలల్లో మునిగి తేలాడు. అయితే ఆ సమయానికి భర్త రావడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది.
 
వివరాల్లోకి వెళితే.. మధుసూధన్ అనే వ్యక్తి ఆర్మీలో జవానుగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మధుసూధన్ భార్యకు జ్ఞానేశ్వర్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.
 
ఈ క్రమంలోనే ప్రియుడిని భర్తగా పరిచయం హైదరాబాద్, రెహ్మత్‌నగర్‌లోని యాదగిరి నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. కాగా.. తాజాగా ఆమె ప్రియుడితో కలిసి రాసలీలల్లో మునిగి తేలుతుండగా.. ఆమె భర్త అనుకోకుండా ఇంటికి వచ్చాడు.
 
తన భార్యను పరాయి పురుషుడితో చూసి అవాక్కయ్యాడు. వెంటనే తేరుకుని బయటి నుంచి తలుపుకు గడియ పెట్టి తాళం వేశాడు. నేరుగా వెళ్లి మధుసూధన్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు