ఇసిస్‌తో ఎంఐఎంకు సంబంధాలు : కిషన్ రెడ్డి ధ్వజం

సోమవారం, 28 డిశెంబరు 2015 (15:48 IST)
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులతో ఎంఐఎంకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగించే వ్యక్తులు, సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 
 
ఈ విషయంలో ప్రభుత్వం మెతక వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదంపై అలసత్వం తగదని ఆయన హెచ్చరించారు. గతంలోనూ తెలంగాణకు చెందిన పలువురు సానుభూతిపరులు పలుచోట్ల పట్టుబడ్డారని గుర్తుచేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వీర్యం చేసేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని సూచించారు. ఉగ్రవాద ఘటనలు ఎక్కడ జరిగినా దాని మూలాలు హైదరాబాద్‌లో ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు.

వెబ్దునియా పై చదవండి