కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. మస్లీస్ పార్టీతో బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉందంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎంఐఎం సమర్ధిస్తోందన్న దిగ్విజయ్ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.