కరెంటు బిల్లులను చెల్లించలేదనే సాకు చూపి, రైతుల మోటార్లను, స్టార్టర్లను లాక్కుంటున్నారని ఆరోపించారు. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా రైతులను ఇదే విధంగా వేధించారని... కేసీఆర్ పాలన చంద్రబాబు పాలనను తలపిస్తోందని దుయ్యబట్టారు. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో తుది దశలో ఉన్న నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ. వెయ్యి కోట్లను విడుదల చేయాలని కోరారు.