తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు సన్నాసులని, చిప్పకూడు తింటారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి రాబందుల పార్టీ అని.. తెరాస నేతలు చదువురాని మూర్ఖులంటూ విమర్శలు గుప్పించారు.