తెలంగాణ మంత్రి కేటీఆర్ దంపతులతో మేఘాలయ సీఎం భేటీ

శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (14:11 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ దంపతులతో మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్ నగరంలోని ప్రగతి భవన్‌లో కేటీఆర్, శైలిమ దంపతులను సంగ్మా దంపతులు కలిశారు. ఈ సందర్భంగా సంగ్మా దంపతులను కేటీఆర్ దంపతులు శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
 
ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై కేటీఆర్, సంగ్మాలు చర్చించుకున్నారు. అయితే, ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సంగ్మాతో భేటీ కావడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే సంగ్మా కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. 


 

Glad to meet my dear friend and Minister ITE & Communication Shri @KTRTRS and his wife at their residence in Hyderabad. pic.twitter.com/zQ0MkePLGD

— Conrad Sangma (@SangmaConrad) April 8, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు